మార్టేరు గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ మట్టా కుమారి గౌరవ డాక్టరేటుకు ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ మనం ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా జులై 11న హైదరాబాద్లో ఆమె ఈ అవార్డు అందుకోనున్నారు. సర్పంచ్గా కుమారి చేసిన సేవలు, ఉన్నత విద్యాభ్యాసాన్ని గుర్తించి ఈ డాక్టరేట్ ప్రకటిస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు.