, భీమవరంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జనతా వారిది కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి ఉన్నమట్ల కపర్ది పాల్గొన్నారు. జిల్లా కో కన్వీనర్లు వెంకటేశ్వర్లు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఐకే రాజు, పాలకోడేరు మండల ప్రెసిడెంట్ బలరాంరాజు, భీమవరం టౌన్ ప్రెసిడెంట్ బాలశివ, సుబ్బరాజు తదితరులు పాల్గొని ప్రజల వినతులను స్వీకరించారు.