కాళ్ల మండలం పెదఅమిరంలో శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ 125వ జయంతిని బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు సతీమణి శ్యామలదేవి శ్యాం ప్రకాష్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఆమె మాట్లాడుతూ ముఖర్జీ రాజకీయ, విద్యాసేవలను గుర్తు చేశారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గాదిరాజు వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొని నివాళి అర్పించారు.