ఏలూరు, చింతలపూడి (ప.గో) ప్రాంతాల్లోని వేగవరం గ్రామంలో ఇద్దరు మహిళలకు NTR భరోసా పథకం కింద స్పౌజ్ పెన్షన్లను సచివాలయం సిబ్బంది బుధవారం అందజేశారు. కూటమి నాయకుల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి, భర్తలు మరణించిన మహిళలకు నెలకు రూ. 4,000 చొప్పున పెన్షన్ మంజూరు పత్రాలు అందించారు.