రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత

రైతుల సంక్షేమానికి కూటమిప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని జనసేన దెందులూరు మండలం ముఖ్య నాయకులు పెద్దిసెట్టినాని టిడిపి యువత దెందులూరు మండలం అధ్యక్షులు ఏనుగు రామకృష్ణ అన్నారు. గాలాయగూడెం గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం బుధవారం జరిగింది. వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులకు వరి సాగు వ్యాధులు లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సుదీర్ఘంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్