ఏలూరు: ట్రేడింగ్‌లో లాభాల పేరిట భారీ మోసం..!

ఏలూరు అగ్రహారానికి చెందిన వెంకట సాయి, ట్రేడింగ్‌లో లాభాల పేరుతో తన తోటి ఉద్యోగి సాయి ప్రవీణ్‌ చేతిలో రూ.6.64 లక్షలు మోసపోయినట్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. గత ఏడాది పలు దఫాలుగా డబ్బు చెల్లించినా, ఆరు నెలలు గడిచినా లాభాలు రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.

సంబంధిత పోస్ట్