ఏలూరు: మానవతా ఆధ్వర్యంలో రహదారికి మరమత్తులు

మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కైకలూరు వారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏలూరు రోడ్డు పోలరాజ్ కాలువ నుండి కాకతీయ నగర్ శివారు వరకు రహదారి మరమత్తు పనులు మంగళవారం చేపట్టారు. ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు ఏర్పడిన గుంతల వలన ప్రయాణికులు పడే ఇబ్బందులు వర్ణనాతీతం. ఆ ఇబ్బందులను గుర్తించిన మానవతా సభ్యులు ప్రభుత్వం పై ఆధారపడకుండా దాతల సహాయంతో మరమత్తులు చేపట్టినట్లు మానవతా సభ్యులు ఇమ్మడి పాండురంగ విట్టల్ తెలిపారు.

సంబంధిత పోస్ట్