అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న ముదినేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన గోనె మాధవి (35) గురువారం మృతిచెందింది. నడవలేని స్థితిలో ఉన్న ఆమెకు, సదరంలో వేలిముద్రలు పడకపోవడంతో పింఛను మంజూరు కాలేదు. దీంతో ఆమె స్థానికుల సాయంతో అధికారులకు దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేకపోయింది. వైద్యులు ఆమె కుటుంబాన్ని పరామర్శించి, మట్టి ఖర్చుల నిమిత్తం రూ. 5 వేల ఆర్థిక సాయం అందించారు.