సంక్రాంతి పండుగ సందర్భంగా పోలవరం మండలంలో కోడిపందాలు, జూదాన్ని అరికట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. శనివారం ఎస్సై పవన్ కుమార్ ఆధ్వర్యంలో పట్టిసీమ గ్రామంలో కోడిపందాల బరులను ధ్వంసం చేశారు. పండుగ పేరుతో జూదం, కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.