తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లిలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న బైక్ను మరో బైక్ ఢీకొంది. ఈ ఘటనలో ఒక వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. కాగా అతడిని తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలనుకు చెందిన అర్ధయ్యగా గుర్తించారు.