ఉండి SVS స్పెషల్ స్కూల్లో మంజు లిఖిత అనే తలసేమియా బాధితురాలికి మంగళవారం, ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నెలకు సరిపడా మందులు, రూ. 5 వేల నగదును లయన్ వెంకట్రామరాజు అందజేశారు. విద్యార్థుల్లో తలసేమియా కేసులు పెరగడం ఆందోళనకరమని MEO లక్ష్మీనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో డా. రంగరాజు, రంగప్రసాదరాజు, సుబ్రహ్మణ్యం రాజు, రూత్ కళ, రాము, మహంకాళి, MPTC వెంకటేశ్వరారావు, విమలబాయమ్మ, లక్ష్మీ, మీనాక్షి, గుప్త, మధు, తబిత పాల్గొన్నారు. ఉండిలో ఆహార పొట్లాలు కూడా పంపిణీ చేశారు.