ఉండి మండలం యండగండిలో పార్శిల్లో మృతదేహం ఘటనపై జిల్లా ఎస్పీ అస్మాన్ నయం అస్మి శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఆస్తి కోసం శ్రీధర్ పర్లయ్యను హత్య చేసి డెడ్బాడీని తులసికి పంపిన విషయం తెలిసిందే. పర్లయ్యను చంపేందుకు ముందే మరో వ్యక్తిని హత్య చేయడానికి శ్రీధర్ ప్లాన్ చేసినట్లు తెలిపారు. భయంతో ప్లాన్ను విడిచిపెట్టి 17న పర్లయ్యకు మద్యం పట్టించి మెడకి తాడు బగించి హత్య చేశారన్నారు.