చిరుతపులి సంచారంపై నిఘా ఏర్పాటు

ద్వారకాతిరుమల మండలం ఎం. నాగులపల్లి, భీమడోలు జంక్షన్ ప్రాంతంలో చిరుతపులి సంచారంపై నిఘా ఏర్పాటు చేశామని భీమడోలు సీఐ విల్సన్ అన్నారు. శనివారం రాత్రి భీమడోలు జంక్షన్ సమీపంలోని అందనాలమ్మ ఆలయ ఆర్చ్ సమీపంలో చిరుతపులి కనబడిందని ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు, పోలీసులు ప్రాంతంలో జంతు పాదముద్రలను పరిశీలించామన్నారు. అది పులి లేదా అడవి పిల్లిఅయి ఉండొచ్చని,  సీసీ ఫుటేజ్ లలో పులి జాడ లేదన్నారు.

సంబంధిత పోస్ట్