ఇద్దరు అంతర్ జిల్లా దొంగలు అరెస్ట్

బైక్ చోరీలకు పాల్పడిన ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను ఏలూరు జిల్లా గణపవరం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ. ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసి రూ. 40 లక్షల విలువ గల 45 బైకులు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనంతరం నిడమర్రు సీఐ సుభాష్, గణపవరం ఎస్ఐ మణికుమార్, సిబ్బందిని డీఎస్పీ అభినందించి నగదు రివార్డు అందించారు.

సంబంధిత పోస్ట్