AP: రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సమావేశమయ్యారు. "ఆంధ్రప్రదేశ్లో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే మంత్రిని కోరాను. వైజాగ్లో మెట్రో పనులను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశా. సానుకూల పరిణామాల కోసం ఎదురు చూస్తున్నా." అని పేర్కొంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.