AP: కోనసీమ జిల్లా, కాట్రేనికోన మండలం గెద్దనపల్లి పంచాయతీ పరిధిలోని చెరువులో శనివారం వేటకు వెళ్లిన పాలెపు భైరవస్వామి (45) అనే మత్స్యకారుడు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి చెందాడు. స్థానికులు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. భార్య విదేశాల్లో ఉండగా, ఇద్దరు పిల్లలు కాకినాడలో చదువుకుంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI అవినాశ్ తెలిపారు.