ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్, వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఓ వ్యక్తి హత్యకు సంబంధించి సుపారీ ఇచ్చినట్లు నమోదైన కేసులో గౌతమ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్ పార్ధివాలా, జస్టిస్ మహదేవన్ల ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరించాలని స్పష్టం చేసింది.