ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అగ్నిమాపక విభాగంలో అవినీతి కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కోర్టు ముందు మూడు వారాల లోపు లొంగిపోవాలని ఆదేశించింది. గతంలో హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై జస్టిస్ అమానుతుల్లా, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది.