AP: ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో నకిలీ పట్టాలకు సంబంధించిన కేసులో గన్నవరం మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ మోహన్ శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణలో భాగంగా వాయిదా కోసం ఆయన కోర్టుకు వచ్చారు. కోర్టు వద్దకు చేరుకున్న ఆయనతో పలువురు సంభాషించారు. కాగా, గతంలో వంశీ పలు కేసుల్లో జైలులో ఉన్న విషయం తెలిసిందే.