2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత మాజీ మంత్రులతో సహా పలువురు కీలక నేతలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. వీరిలో కొంతమంది టీడీపీ, జనసేనలో చేరారు. అయితే వీరు పార్టీ మారినా తగిన పదవులు, గుర్తింపు దక్కలేదు. దీనికి ప్రధాన కారణం అధికార పార్టీ నాయకులు వీరితో కలిసి పని చేయడానికి ఒప్పుకోకపోవడమే. దీంతో వీరి పరిస్థితి ఎటూ కాకుండా పోయింది. ఈ క్రమంలో మాజీ మంత్రులు ఏం చేయాలో అర్థం కాక డైలమాలో పడిపోయారు. అయితే వీరు తిరిగి మళ్లీ వైసీపీ గూటికి చేరే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. కానీ వైసీపీ తిరిగి వీరిని పార్టీలో చేర్చుకుంటుందో లేదో చూడాలి.