AP: కూటమి ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు శుభవార్త చెప్పింది. గర్భిణులు, చిన్నారులకు సేవలు మెరుగుపరచడానికి 58,402 మందికి రూ.12,500 విలువైన సామ్సంగ్ మొబైల్స్ అందిస్తోంది. విజయవాడలో బుధవారం జరిగే కార్యక్రమంలో మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి ఈ మొబైల్స్ పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఈ ఫోన్లను పంపిణీ చేస్తారు. దీని కోసం మొత్తం రూ.74 కోట్లు ఖర్చు చేశారు.