AP: వైసీపీ నుంచి నేతలు జారి పోతున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మరో నాయకురాలు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత జగన్కు గుడ్బై చెప్పనున్నట్టు చర్చ సాగుతోంది. మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత కూడా వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారు. ఇప్పుడు ఓ పార్టీ అధినేత, ప్రభుత్వంలో కీలక పాత్రలో ఉన్న నాయకుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఆమె త్వరలోనే పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది.