AP: ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో అందరూ చురుకుగా పాల్గొనాలని తెలిపారు. ప్రజల్లో నిరంతరం ఉండి వారి సమస్యలను పరిష్కరించగలిగితేనే నిజమైన నేతలుగా రాణించవచ్చని అన్నారు. పింఛన్ల పంపిణీని సేవా కార్యక్రమంగా భావించి బాధ్యతగా వ్యవహరించాలని చెప్పిన చంద్రబాబు, ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో 25 వేల మంది నేతలు పాల్గొన్నట్లు వెల్లడించారు.