ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రూ.38.7 వేల కోట్లు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. సహకార సంఘాల్లో అవినీతి అక్రమాలతో మెక్కినదంతా కక్కిస్తామని, అవినీతి చేసిన సొమ్మును రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు మంత్రి అచ్చెన్నాయుడు స్వీకరించి మాట్లాడారు.