ఏపీలోని రేషన్ డీలర్లకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ డీలర్ల కమీషన్, నిత్యావసరాల రవాణా నిమిత్తం ప్రభుత్వం రూ.210.44 కోట్లకు పాలనా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి సౌరభ్గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు.