AP: మత్స్యకారుల గల్లంతు ఘటనపై హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. మత్స్యకారుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. గల్లంతైన వారిని తీరానికి చేర్చేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.