పీఎన్‌జీ కనెక్షన్లకు పెరుగుతోన్న డిమాండ్

AP: రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లు ఇవ్వాలని, వచ్చే మూడు నెలల్లో లక్ష కనెక్షన్లు ఇచ్చేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. దాంతో పీఎన్‌జీ కనెక్షన్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే 2.90 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లు ఇచ్చేందుకు పైపులైన్లు ఉన్నాయి. 1.58 లక్షల ఇళ్లకు మీటర్లు బిగించారు. 65 వేల కుటుంబాలు పీఎన్‌జీ కనెక్షన్లు వినియోగిస్తున్నారు. పీఎన్‌జీ గ్యాస్ కోసం సిలిండర్ బుక్ చేసుకోవాల్సిన పని లేదు. ఎప్పుడొస్తుందో అని ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఎంత వాడుకుంటే అంతే బిల్లు వస్తుంది.

సంబంధిత పోస్ట్