AP: పాల ఉత్పత్తులపై GST తగ్గడంతో సంగం, విజయ డెయిరీలు ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. సంగం డెయిరీ UHT పాలు లీటరుపై రూ.2, పన్నీర్ కిలో రూ.15, నెయ్యి-వెన్న కిలోకి రూ.30, బేకరి ప్రొడక్టులు కిలోపై రూ.20 మేర తగ్గించనున్నట్లు తెలిపింది. విజయ డెయిరీ టెట్రాపాలు లీటరు రూ.5, ఫ్లేవర్డ్ మిల్క్ లీటరుకు రూ.5, పన్నీర్ కిలో రూ.20, వెన్న-నెయ్యి పై కిలోకి రూ.30 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా తగ్గిన ఈ ధరలు SEP 22 నుంచి అమలులోకొస్తాయని ప్రకటించాయి.