ఓటర్ల జాబితాను జూలై 14 లోపు పూర్తి చేయాలని అధికారులకు

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను జూలై 14 లోపు పూర్తి చేయాలని గుంటూరు తూర్పు ఈఆర్ఓ , నగర కమిషనర్ శ్రీ కె. మయూర్ అశోక్ ఆదేశించారు. బుధవారం ఆర్టీసి కాలనీ, మోతీలాల్ నగర్, తారకరామ నగర్ ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ మరియు డిజిటలైజేషన్ ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు. పర్యటనలో భాగంగా డ్రైన్లు అపరిశుభ్రంగా ఉండటంపై శానిటరీ ఇన్స్పెక్టర్లపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్