తెనాలి పట్టణంలోని వివిధ దేవాలయాల్లో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా సోమవారం అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతి దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా ఆలయాలకు తరలివెళ్లారు. దీంతో పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.