మాదకద్రవ్యాలు బాల్యవివాహాలపై అవగాహన సదస్సు

బాపట్ల మండల న్యాయ సేవ సాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం స్టువర్టుపురం సచివాలయంలో బాల్యవివాహాలు, మాదకద్రవ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు ప్రోత్సహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని న్యాయవాదులు హెచ్చరించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు న్యాయవాదులు ఆంజనేయులు, కిరణ్ కుమార్, పిఎల్వి పఠాన్ మహమ్మద్ ఖాన్, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్