బాపట్ల పట్టణం మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో, సీవీఏపీ (పీ-4) కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే వేగేశనసేన నరేంద్ర వర్మ ప్రజా దర్బార్ గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులు స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరిగింది.