శనివారం బాపట్ల పట్టణంలో సీఐ రాంబాబు వివిధ పాఠశాలల సమీపంలోని వ్యాపార దుకాణాలను తనిఖీ చేశారు. పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న వ్యాపారులకు జరిమానాలు విధించారు. పాఠశాలల వద్ద పొగాకు పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని, విద్యార్థుల రక్షణకు నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని సీఐ రాంబాబు హెచ్చరించారు.