గుంటూరు మిర్చి యార్డ్ డైరెక్టర్గా నియమితులైన డొక్కుమళ్ళ భాగ్యరావును గురువారం ప్రత్తిపాడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులు శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు. రైతు సమస్యల పరిష్కారానికి, మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.