కుష్టు వ్యాధి నివారణపై ప్రజలు తప్పనిసరిగా అవగాహన పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో కుష్టు వ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమాలను ఆయన ప్రారంభించి, గోడపత్రాలను విడుదల చేశారు. అవగాహనతోనే కుష్టు వ్యాధిని నిర్మూలించగలమని, దీనిపై అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. శుక్రవారం నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు.