చిలకలూరిపేట సుభానినగర్కు చెందిన 5వ తరగతి విద్యార్థి చందు, సరదాగా ఈత కొట్టేందుకు వాగుకు వెళ్ళాడు. నీటి లోతును అంచనా వేయకపోవడంతో ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. సమీపంలో ఉన్నవారు గమనించి గాలింపు చేపట్టి బాలుడిని వెలికి తీయగా, అప్పటికే మృతి చెందినట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.