పేటలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

చెన్నై-కలకత్తా జాతీయ రహదారిపై గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పరిధిలో పీయస్5 హోటల్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. టీవీఎస్ ఎక్స్ఎల్ మోపెడ్ పై ప్రకాశం జిల్లా అనంతవరం వైపు నుంచి వస్తున్న వ్యక్తి రోడ్డు దాటుతుండగా మార్టూరు వైపు నుంచి చిలకలూరిపేట వైపు వెళ్తున్న కారును బలంగా ఢీకొంది. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన మోపెడ్ పై వస్తున్న వ్యక్తి మరణించాడు. సంబంధిత వ్యక్తి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

సమాచారం అందుకున్న చిలకలూరిపేట 108 సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈఎంటి శోభన్ బాబు ప్రమాదానికి గురైన వ్యక్తిని పరీక్షించారు. కాగా అప్పటికే అతను మరణించి ఉన్నాడు. చిలకలూరిపేట రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్