చీరాల మండలం బోయిన వారి పాలెం గ్రామంలో గురువారం ఎడ్ల బండి పోటీలు జరిగాయి. ఎమ్మెల్యే కొండయ్య ఈ పోటీలను ప్రారంభించి, కమిటీ సభ్యులు ప్రతి ఏడాది వీటిని నిర్వహించడం సంతోషదాయకమని అన్నారు. ప్రజలందరూ పాల్గొని ఆనందంగా గడపాలని ఆయన కోరారు.