కాకినాడ జిల్లా కత్తిపూడి సమీపంలోని రావికంపాడు జంక్షన్ వద్ద లారీ కంటైనర్ను ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కంటైనర్లో మంటలు చెలరేగి, అందులో ఉన్న క్లీనర్ సజీవదహనం అయినట్లు సమాచారం. ఈ దుర్ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.