నగరంపాలెం PS పరిధిలోని కేవీపీ కాలనీలో గంజాయి విక్రయిస్తూ, వినియోగిస్తున్న నలుగురు యువకులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 1.05 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నగరంపాలెం పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిలో దావీదు, యేసుబాబు, నందు, చరణ్ నలుగురు కేవీపీ కాలనీకి చెందినవారే కాగా, వారిలో కొందరిపై గతంలో పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు.