పెళ్లి చూపుల కోసం స్వగ్రామానికి వెళ్తున్న ఝార్ఖండ్కు చెందిన కార్తీక్ (26) కేరళ నుంచి రైలులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందిన ఘటన చుండూరు వద్ద చోటుచేసుకుంది. మృతదేహాన్ని తరలించేందుకు ఆర్థిక స్తోమత లేని కుటుంబానికి రోటరీ క్లబ్ రూ.30వేల ఆర్థిక సాయం అందించింది. సబ్ కలెక్టర్, MRO చేతుల మీదుగా ఈ నగదును కుటుంబ సభ్యులకు అందజేసి, మృతదేహాన్ని అప్పగించారు.