విజయవాడకు చెందిన జ్యోతిబసు రోడ్డు ప్రమాదంలో గాయపడి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జ్యోతిబసు చికిత్స పొందుతున్నారు. అయితే బ్రెయిన్ డెడ్ కావడంతో ఆస్పత్రి సిబ్బంది అవయవ దానం మీద బంధువులను అడగగా అవయవ దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా గురువారం గ్రీన్ ఛానల్ ద్వారా జ్యోతిబసు అవయవాలు వివిధ ప్రాంతాలకు తరలించారు. జ్యోతిబసు చనిపోయి కూడా మరికొందరికి ప్రాణదానం చేసింద ని ఎందుకు మాకు ఆనందంగా ఉందని బంధువులు తెలిపారు.