ఈ నెల 14వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి ఉదయం 9: 30 నుండి 10: 30 గంటల వరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్ (0863-2224202) కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అనంతరం "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక" (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం కౌన్సిల్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 1 గంట వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.