గుంటూరులో 14 ఏళ్ల బాలుడు ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. పొట్టి శ్రీరాములు నగర్కు చెందిన బాలుడు రాజీవ్ గాంధీనగర్లోని అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాడు. మే 29న రాత్రి గొడవ నేపథ్యంలో ఎలుకల మందు తిన్నాడు. నాయనమ్మ ఇంటికి వెళ్లిన తర్వాత వాంతులు చేసుకోవడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందగా, తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.