బ్రాడీపేట శంకర్విలాస్ సెంటర్ వద్ద నిరసన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఘటనపై వైకాపా నేతలు అంబటి రాంబాబు, నూరి ఫాతిమా సహా పలువురిపై అరండల్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. నేతలు, కార్యకర్తలు పోలీసుల బారికేడ్లను తొలగించి రోడ్డుపై ధర్నా చేయడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.