తుఫాన్ తీరం దాటినప్పటికీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం రాత్రి టెలి కాన్ఫరెన్స్లో సూచించారు. వాగులు, వంకలు దాటకుండా బారిగేట్లు ఏర్పాటు చేయాలని, రాత్రి సమయాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.