గుంటూరు: టీడీపీలో చేరిన రిటైర్డ్ ఏఎస్ఐ ఏడుకొండలు

రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీతోనే ఉజ్వల భవిష్యత్తు అని, సీఎం చంద్రబాబు నాయుడు విజనరీ నచ్చడంతో పార్టీలో చేరుతున్నానని రిటైర్డ్ ఏఎస్ఐ గుడిపల్లి ఏడుకొండలు తెలిపారు. గుంటూరు తూర్పు శాసనసభ్యుల వారి కార్యాలయంలో గురువారం నాడు గుడిపల్లి ఏడుకొండలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్