గుంటూరులో పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్రమంగా తరలిస్తున్న సుమారు 2.75 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఆంజనేయస్వామి గుడి వద్ద వాహనాన్ని తనిఖీ చేయగా 55 బస్తాలలో ఉన్న బియ్యాన్ని గుర్తించారు. బియ్యంతో పాటు వాహన డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.