గుంటూరు జిల్లా పోలీసులు శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వల్లభాయ్ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అవగాహన ర్యాలీ చేపట్టారు. గుంటూరు జిల్లా ఎస్పీ జిందాల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, ర్యాలీని ప్రారంభించారు.