పిడుగురాళ్లలో రైల్వే బ్రిడ్జి సమీపంలో లభ్యమైన మృతదేహం గుంటూరు జిల్లా తుమ్మలచెరువు గ్రామానికి చెందిన వ్యక్తిదిగా రైల్వే పోలీసులు గుర్తించారు. జీవనోపాధి కోసం పిడుగురాళ్లలో మొక్కజొన్న ఖండిలు అమ్ముకుంటూ జీవిస్తున్న అతడు, చెవిటితనం కారణంగా రైలు శబ్దం వినిపించక ప్రమాదానికి గురైనట్లు ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.